
సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ(జూన్ 16) రైతు నేస్తం ప్రోగ్రామ్ ను ప్రారంభించారు. రాజేంద్రనగర్ లోని అగ్రి వర్శిటీలో 1034 రైతు వేదికల నుంచి రేవంత్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో ముఖాముఖి నిర్వహించారు. రైతు భరోసా,రుణమాఫీ, రైతుల సమస్యలు,సన్నవడ్ల బోనస్ పై రైతులను అడిగి తెలుసుకున్నారు . ఈ సందర్బంగా సన్న బియ్యం,రైతు భరోసా,బోనస్ పై ఆనందం వ్యక్తం చేశారు.
వీడియో కాన్ఫరెన్స్ లో ఖమ్మం జిల్లా నేలకొండ పల్లికి చెందిన రామకృష్ణ అనే రైతుతో మాట్లాడుతున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ఏమన్నాడంటే.? రామకృష్ణా.. మీ ఖమ్మం వాళ్లు హుషారున్నారయ్యా... వ్యవసాయ శాఖ మీరే తీసుకపోయారు..రెవెన్యూ శాఖ మీరే తీసుకుపోయారు..ఆర్థిక శాఖ శాఖ మీరే తీసుకపోయారు.ఇంకా ఏముందయ్యా మొత్తం ఖమ్మం జిల్లాకే ఇచ్చినం..పంటలు కూడా మంచిగా పండించండి. అని రేవంత్ అనడంతో అక్కడ అందరూ నవ్వుకున్నారు.
రైతు భరోసా డబ్బులు రిలీజ్
రైతు భరోసా డబ్బులు రిలీజ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రైతులకు తొమ్మిది రోజుల్లో 9 వేల కోట్లు జమ చేస్తామన్నరేవంత్... 70 లక్షల 11 వేల మంది రైతులకు రైతు భరోసా డబ్బులు పడతాయని చెప్పారు. మొత్తం కోటి 49 లక్షల ఎకరాలకు రైతు భరోసా ఇస్తున్నామన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా పథకాలు ఆపడం లేదన్నారు రేవంత్.