
హైదరాబాద్ లో మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చింది. శిల్పా లే ఔట్ ఫేజ్ 2 ఫ్లైఓవర్ ను జూన్ 28 న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. కొండాపూర్ నుంచి గచ్చిబౌలి వరకు నిర్మించిన బై డైరెక్షనల్ ఫ్లై ఓవర్ కు దివంగత కాంగ్రెస్ నేత పి. జనార్దన్ రెడ్డి(పేజేఆర్) పేరు పెట్టింది ప్రభుత్వం. ఓఆర్ఆర్ నుంచి గచ్చిబౌలి వరకు 1.2 కిలోమీటర్ల మేర నిర్మించిన ఈ బై డైరెక్షనల్ ఫ్లై ఓవర్కు రూ. 182కోట్లు ఖర్చు పెట్టారు.
ఈ ఫ్లై ఓవర్ పై నుంచి 1.2 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 2 నిమిషాల 25 సెకన్లలో చేరుకోవచ్చు. కొత్తగూడ సమీపంలో ముగిసే ఈ ఫ్లై ఓవర్నుంచి కొండాపూర్వరకు ట్రాఫిక్తిప్పలు లేకుండా చేరుకోవచ్చు. గచ్చిబౌలి నుంచి కొండాపూర్ వెళ్లేవారికి ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. మొత్తం 4.4 కిలోమీటర్లు ఉంటే ఈ రూట్లో ఓఆర్ఆర్ఎగ్జిట్నుంచి కొత్తగూడ జంక్షన్వరకు ఉదయం, సాయంత్రం కిలోమీటర్ ప్రయాణించాలంటే దాదాపు అరగంటకు పైగానే పడుతుంది. మధ్యాహ్నం వేళలో 15 నిమిషాలకు తక్కువ పట్టడం లేదు. దీనివల్ల ఇంధన భారంతోపాటు వాహనదారులు ట్రాఫిక్ లో ఇరుక్కుపోయి చుక్కలు చూస్తున్నారు. అయితే, ఫ్లై ఓవర్ ప్రారంభంతో ఈ కష్టాలకు చెక్పడనున్నది.
అతిపెద్ద ఫ్లై ఓవర్లలో స్థానం..
పీజేఆర్ ఫ్లైఓవర్ నగరంలోని అతిపెద్ద ఫ్లైఓవర్లలో ఒకటిగా స్థానాన్ని దక్కించుకోనుంది. సిటీలో పీవీ నరసింహారావు ఎక్స్ప్రెస్ వే నాలుగు లేన్లతో11.66 కి.మీ తో మొదటి స్థానంలో నిలవగా, ఆరాంఘర్ ఫ్లైఓవర్ ఆరులేన్లతో 4.08 కి.మీ తో రెండో స్థానంలో ఉంది. కొత్తగూడ ఫ్లైఓవర్ నాలుగులేన్లతో 3 కి.మీ(మూడో స్థానం) , షేక్ పేట ఫ్లైఓవర్ ఆరులేన్లతో 2.71 కి.మీ(నాలుగో స్థానం) , శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ ఫేజ్–1 నాలుగు లేన్లతో 1.75 కి.మీ (ఐదోస్థానం) ఉండగా, ఓవైసీ- మిథాని ఫ్లైఓవర్ మూడు లేన్లతో 1.40 కి.మీ (ఆరో స్థానం) ఉంది. ఆ తర్వాత పీజేఆర్ ఫ్లైఓవర్ 1.20 ఏడో స్థానంలో నిలిచింది. దీని తర్వాత బాలానగర్ ఫ్లై ఓవర్ 1.13 కి.మీతో ఎనిమిదో స్థానాన్ని దక్కించుకుంది.