అంబర్పేట్, వెలుగు: ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్’ కు రావాలని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్యను సీఎం రేవంత్రెడ్డి ఆహ్వానించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం రాత్రి నల్లకుంటలోని రామయ్య నివాసానికి వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి పంపిన ఇన్విటేషన్ కార్డును ఆయనకు అందజేశారు.
సీఎం రాసిన లేఖలో “తెలంగాణ రైజింగ్ 2047 దార్శనికతను ఈ సమిట్లో ఆవిష్కరిస్తున్నాం. మిమ్మల్ని వ్యక్తిగతంగా కలవాలని ఎదురుచూస్తున్నాను. భవిష్యత్తు కోసం ఈ దార్శనికతను నిజం చేయడంలో మీ మద్దతు, భాగస్వామ్యాన్ని ఆశిస్తున్నాం” అనిపేర్కొన్నారు.
