మహబూబ్నగర్ అర్బన్, వెలుగు: పార్టీ లైన్ దాటితే చర్యలు తీసుకుంటామని మహబూబ్నగర్ డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ హెచ్చరించారు. నగరంలోని పార్టీ జిల్లా ఆఫీస్లో ఆదివారం మీడియాతో మాట్లాడారు. జిల్లాలో 423 గ్రామపంచాయతీలకు ఎన్నికల జరుగుతున్నాయని, ప్రజలు అభివృద్ధిని చూసి ఓట్లు వేయాలన్నారు. రాబోయే మూడేళ్లలో అన్ని గ్రామాల్లో అభివృద్ధి పరుగులు పెడుతుందని, ప్రతి గ్రామాన్ని మోడల్ విలేజ్గా డెవలప్ చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేస్తున్న క్యాండిడేట్లను గెలిపించుకునేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా, ప్రజా ప్రభుత్వం బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
