వనపర్తి, వెలుగు: వనపర్తి నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తానే తీసుకుంటానని, అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించాలని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కోరారు.
ఆదివారం పెద్దమందడి మండలం అమ్మపల్లి అభ్యర్థి మాధవి, అల్వాల అభ్యర్థి సుదర్శన్రెడ్డి, వెల్టూర్ అభ్యర్థి శేఖర్, జగత్పల్లి అభ్యర్థి గట్టుయాదవ్, మనిగిళ్ల అభ్యర్థి శివయాదవ్, పెద్దమందడి అభ్యర్థిసూర్యగంగమ్మకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో పర్యటించి తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని వివరించారు. సర్పంచులను గెలిపిస్తే ప్రభుత్వం మరిన్ని సంక్షేమ పథకాలు తీసుకొస్తుందని తెలిపారు.
నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తున్నామని, ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు వేయిస్తున్నామని చెప్పారు. పెబ్బేరు మండలం రామమ్మపేట సర్పంచ్గా పద్మమ్మ ఏకగ్రీవం కావడంతో, గ్రామానికి ఎస్డీఎఫ్ నుంచి రూ.20 లక్షలు ఇస్తానని ప్రకటించారు.
