
ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి యునైటెడ్ కింగ్డమ్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ తెలంగాణ రైజింగ్ 2047 విజన్లోని కీలక అంశాలను పంచుకున్నారు. Telangana Rising విజన్ అమలులో సహకరించడానికి టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ (TBIGC) తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.
సుస్థిరత సూత్రాలతో తెలంగాణ అభివృద్ధి ఎజెండా దృఢంగా ఉందని టోనీ బ్లెయిర్ ప్రశంసించారు. భారత్ ఫ్యూచర్ సిటీ (Bharat Future City), యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (Young India Skills University), యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ (Young India Sports University) వంటి ప్రధాన కార్యక్రమాలపై బ్లెయిర్ ఆసక్తి చూపారు.
తెలంగాణలో రైతులు, యువత, మహిళలు వంటి విభిన్న వర్గాల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఈ సందర్భంగా రేవంత్ తెలిపారు. తెలంగాణ కోర్ అర్బన్, సెమీ-అర్బన్, గ్రామీణ ప్రాంతాల వారీగా అభివృద్ధి కోసం సూక్ష్మ ప్రణాళికను సరికొత్తగా రూపొందిస్తున్నట్టు తెలిపారు.