రాహుల్‌‌‌‌‌‌‌‌ గాంధీ యాత్రలో రేవంత్..ప్రియాంక గాంధీతో కలిసి పాల్గొన్న సీఎం

రాహుల్‌‌‌‌‌‌‌‌ గాంధీ యాత్రలో రేవంత్..ప్రియాంక గాంధీతో కలిసి పాల్గొన్న సీఎం

హైదరాబాద్, వెలుగు: ఓటు చోరీకి వ్యతిరేకంగా బిహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో సాగుతున్న ఓటర్​ అధికార్ యాత్రలో సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌ రెడ్డి పాల్గొన్నారు. మంగళవారం సుపౌల్‎లో యాత్ర కొనసాగగా..  ఓపెన్ టాప్ జీపులో రాహుల్, ప్రియాంక గాంధీతోపాటు రేవంత్ రెడ్డి కొద్దిసేపు ప్రయాణించి.. అక్కడి  జనాలకు అభివాదం చేశారు.  రేవంత్‌‌‌‌‌‌‌‌ రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, మంత్రులు పొన్నం​, పొంగులేటి, సీతక్క, వాకిటి, పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాహుల్​ గాంధీని కలిసి సంఘీభావం ప్రకటిం చారు.  అనంతరం నేతలంతా ప్రియాంక గాంధీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్కను ప్రియాంక గాంధీ ఆప్యాయంగా పలకరించి, రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై ఆరా తీశారు.