కుమారి ఆంటీ హోటల్ పై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి

కుమారి ఆంటీ హోటల్ పై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి

కుమారి ఆంటీ హోటల్ ఎత్తివేతపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ట్రాఫిక్ రద్దీ, ట్రాఫిక్ జాం కారణంగా కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ హోటల్ ను పోలీసులు తొలగించారు. ఈ విషయంపై విమర్శలు రావటం.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆమెకు మద్దతు రావటంతో సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. 

కుమారి ఆంటీ హోటల్ ను అక్కడే కొనసాగించాలని.. ట్రాఫిక్ జాం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ డీజీపీని ఆదేశించారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజా పాలన నడుస్తుందని.. పేదల, బడుగు, బలహీన వర్గాలకు అండగా ఉంటుందని.. స్వయం ఉపాధితో బతుకున్న వారికి అండగా ఉంటుందని వివరించారు రేవంత్ రెడ్డి. కుమారి ఆంటీ హోటల్ నిర్వహించుకునే విధంగా ట్రాఫిక్ పోలీసులు అనుమతి ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి సీపీఆర్వో అయోధ్యరెడ్డి ఎక్స్ ద్వారా పోస్ట్ చేశారు. త్వరలో కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ కు సీఎం రేవంత్ రెడ్డి వెళతారంటూ సీఎంపీఆర్వో ప్రకటన చేసింది.