హైదరాబాద్, వెలుగు: మాజీ ఎమ్మెల్సీ మౌలా నా హఫీజ్ పీర్ షబ్బీర్ సామాజిక సేవకుడని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఆయన రాష్ట్రంలో హిందూ-–ముస్లింలు కలిసి జీవించే మంచి వాతావరణాన్ని సృష్టించారని గుర్తు చేశారు. ఇటీవల అనారోగ్యంతో మృతిచెంది న మౌలానా హఫీజ్ పీర్ షబ్బీర్ కుటుంబాన్ని సీఎం రేవంత్రెడ్డి పరామర్శించారు. సోమవా రం జల్పల్లి మున్సిపాలిటీ పరిధి షహీన్ నగర్ లోని షబ్బీర్ ఇంటికి సీఎం వెళ్లారు.
కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. “పీర్ షబ్బీర్ మరణం ముస్లింలకే కాకుండా, మొత్తం రాష్ట్రానికే తీరని లోటు. ఆయన సేవలు మరువలేనివి. మనమధ్య లేకపోవడం ఎంతో బాధాకరం. అం దుకే వారి కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చా. మైనారిటీ సమస్యల పరిష్కారానికి పీర్ షబ్బీర్ చేసిన కృషి అపూర్వం. ఆయన సేవలను శాశ్వతంగా గుర్తించే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది” అని పేర్కొన్నారు.
