నర్సింగ్ కాలేజీల్లో జపనీస్ నేర్పించాలె: సీఎం రేవంత్ రెడ్డి

నర్సింగ్ కాలేజీల్లో జపనీస్ నేర్పించాలె: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: రాష్ట్రంలోని 34 వైద్య కళాశాలలు పూర్తి స్థాయి వసతులతో పని చేయాలని, ఇందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక ను వెంటనే తయారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని, ఆ కమిటీ ప్రతి కళాశాలను సం దర్శించి అక్కడ ఏం అవసరాలు ఉన్నాయి? ఎంత మేర నిధులు కావాలి? తక్షణమే పూర్తి చేయాల్సిన పనులేంటి? తదితన వివరాలతో నివేదికను సమర్పించాలని సీఎం అన్నారు. 

జూన్ 16న  ఐసీసీసీలో ఆ శాఖ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. జాతీయ వైద్యమండలి (ఎన్ఎంసీ) రాష్ట్రంలోని వైద్య కళాశాలలకు సంబంధించి లేవనెత్తిన పలు అంశాలపై చర్చించారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ని యామకాలు, బోధన సిబ్బందికి ప్రమోషన్లు, వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉన్న దవాఖానల్లో పడకల పెంపు, ఆయా కళాశాలలకు అవసరమైన వైద్య పరికరాలు, ఖాళీల భర్తీ వీ టన్నింటిపై సమగ్ర నివేదిక రూపొందించి అం దించాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల చేయాల్సిన నిధులను వెంటనే విడుదల చేస్తామని సీఎం తెలిపారు. కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి నిధులు, అనుమతులకు సంబంధించిన అంశాలుంటే వెంటనే తెలియజేయాలని, కేంద్ర మంత్రి నడ్డా, ఆ శాఖ అధికారులను సంప్రదించి వాటిని పరి ష్కరిస్తామని సీఎం పేర్కొన్నారు. 

నర్సింగ్ కళాశాలల్లో జపనీస్ ఒక ఆప్షనల్ గా నేర్పించాలని, జపాన్లో మన నర్సింగ్ సిబ్బందికి డిమాండ్ ఉందని సీఎం తెలిపారు. ఆస్పత్రులకు వచ్చే రోగులు, వారికి సేవలందించే సమయాన్ని పర్యవేక్షించేందుకు వైద్యుల కోసం ఒక యాప్ రూపొందించేలా అధ్యయనం చేయాలని సూచించారు. విద్యా, వైద్య రంగాలు ఎంతో కీలకమని, ప్రతి నెలా మూడో వారంలో ఈ రెండు శాఖలపై సమీక్ష నిర్వహించాలని ప్రభు త్వ ప్రధాన కార్యదర్శిని సీఎం రేవంత్ రెడ్డి ఆదే శించారు. సమీక్షలో మంత్రి దామోదర రాజన ర్సింహ, సీఎస్ రామకృష్ణారావు, ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి వీ శేషాద్రి, ముఖ్యమంత్రి కార్యదర్శి మాణిక్ రాజ్, వైద్యారోగ్య శాఖ కా ర్యదర్శి క్రిస్టియానా జడ్ చోంగూ పాల్గొన్నారు.