
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి తొలి ఏకాదశి, మొహర్రం పండు గ శుభాకాంక్షలు తెలిపారు. ఆషాఢంలో వచ్చే ఏకాదశిని ప్రజలందరూ ఏడాదిలో వచ్చే పండుగలకు మొదటి పండుగగా జరుపుకుంటారని అన్నారు.
తొలి ఏకాదశి రాష్ట్ర ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు, సకల శుభాలు కలిగించాలని ప్రార్థించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రైతు కుటుంబాలన్నీ రూ.2 లక్షల రుణ విముక్తి పొం దాలని, ఏకాదశి పండుగను ప్రతి ఇంటా ఆనందంగా జరుపుకోవాలని సీఎం ఆకాంక్షించారు. ఇక.. త్యాగ నిరతికి, అనిర్వచనీయ సహనానికి మొహర్రం ప్రతీకగా నిలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
మహమ్మద్ ప్రవక్త మనుమడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ బలిదానాన్ని సంస్మరణగా మొహర్రం జరుపు కుంటారని వివరించారు. తరతరాలుగా తెలంగాణ గ్రామాల్లో హిందూ, ముస్లింలు కలిసి పీర్ల ఊరేగింపు నిర్వహిస్తున్నారని సీఎం గుర్తు చేసుకున్నారు. .