కేసీఆర్​ నయా నిజాంగా మారి తెలంగాణను నాశనం చేశారు: సీఎం రేవంత్​ 

కేసీఆర్​ నయా నిజాంగా మారి తెలంగాణను నాశనం చేశారు: సీఎం రేవంత్​ 

ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్​ పార్టీలో చేరడంపై  సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్​ కు  ప్రజాస్వామ్యంపై  నమ్మకం లేదని.. ఏనాడూ ప్రజల స్వేచ్ఛను ఆయన గౌరవించలేదన్నారు. నయా నిజాంలా మారి తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కేసీఆర్ నాశనం చేశారని రేవంత్ ఫైరయ్యారు.ఆదివారం ( మార్చి 17) హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో ‘మీట్ ద ప్రెస్’ నిర్వహించారు. ఈ సంద ర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..ఇకపై నారాజకీయం ఎలా ఉంటుందో చూపిస్తానన్నారు. ప్రస్తుతానికి  ఒక గేటు మాత్రమే ఓపెన్ చేశామని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ముందు ముందు ఎవరెవరు చేరుతారో ఇప్పుడే చెప్పలేం అని అన్నారు. 

విపక్ష పార్టీలో ఎవరూలేనప్పుడు  గేట్లు తెరిచినా.. మూసినా ఒక్కటే అన్నారు. ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చిందని.. ఇక నా రాజకీయం ఎలా ఉంటుందో అసలు కథ చూపిస్తానని షాకింగ్ కామెంట్స్ చేశారు. నిజాంను తరిమికొట్టిన చరిత్ర ఉన్న తెలంగాణ మళ్లీ అలాంటి రాజరిక పోకడలు అవలంభించిన కేసీఆర్‌కు బుద్ధి చెప్పారన్నారు. వారసత్వాన్ని తమపై రుద్దాలని చూసినప్పుడు తెలంగాణ సమాజం ఏకమైందని.. ప్రజలు దానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారన్నారు.  కేసీఆర్‌ కుటుంబాన్ని అధికారం నుంచి దించారని చెప్పారు.