కేసీఆర్ జీ చెన్నైకి రండి

కేసీఆర్ జీ చెన్నైకి రండి

ఈ నెల 28 నుంచి ఆగష్టు 10 వరకు తమిళనాడులోని చెన్నై వేదికగా 44వ ఫిడే (FIDE) అంతర్జాతీయ చెస్ ఒలంపియాడ్ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీలకు హాజరుకావాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ను తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆహ్వానించారు. ఈ మేరకు సీఎం స్టాలిన్ తమ పార్టీ రాజ్యసభ సభ్యుడు గిరిరాజాన్ ద్వారా శుక్రవారం ప్రగతి భవన్ కు ఆహ్వాన లేఖను పంపించారు. ఇది తన వ్యక్తిగత ఆహ్వానంగా భావించి 28న ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాల్సిందిగా సీఎం కేసీఆర్ ను తమిళనాడు సీఎం కోరారు.

ఈ సందర్భంగా డీఎంకే ఎంపీ గిరిరాజాన్, సీఎం కేసీఆర్ కు శాలువా కప్పి, జ్జాపికతో పాటు ఆహ్వాన పత్రికను అందించారు. కాగా 188 దేశాల నుంచి చెస్ క్రీడాకారులు పాల్గొంటున్న ఈ పోటీలు, భారత దేశంలో మొదటిసారిగా, ఆసియాలో మూడోసారి జరుగుతున్న ప్రతిష్టాత్మక పోటీలని సీఎం స్టాలిన్ లేఖలో పేర్కొన్నారు.