దేశంలోనే ది బెస్ట్.. యూపీ పోలీసులు

దేశంలోనే ది బెస్ట్.. యూపీ పోలీసులు

మొరాదాబాద్(యూపీ): శాంతిభద్రతల నిర్వహణలో యూపీ పోలీసులు ముందుంటారని, దేశవ్యాప్తంగా రాష్ట్రానికి పేరు తెచ్చారని సీఎం యోగి ఆదిత్యనాథ్​ కొనియాడారు. ఈమేరకు ఆదివారం మొరాదాబాద్​లోని పోలీస్​ అకాడమీలో జరిగిన సబ్​ఇన్​స్పెక్టర్ల పాసింగ్​ అవుట్​ పరేడ్​లో సీఎం చీఫ్​ గెస్ట్​గా పాల్గొన్నారు. కుంభమేళా, ప్రవాసి భారతీయ దివస్, పార్లమెంటరీ ఎలక్షన్లు, అయోధ్య తీర్పుతో పాటు పలు పండుగల సందర్భంగా లా అండ్​ ఆర్డర్​ను కాపాడడానికి ఎంతగానో కృషి చేశారని మెచ్చుకున్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలోనే పోలీసులు ఎన్నో మార్పులు తీసుకొచ్చారని చెప్పారు. పోలీసు అమరవీరుల కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని తమ సర్కారు రూ.40 లక్షలకు పెంచిందని, దీంతో పాటు మరో పది లక్షలను తల్లిదండ్రులకు అందజేస్తున్నామని చెప్పారు. బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తున్నట్లు సీఎం యోగి వివరించారు.