అయోధ్యలో ఏడడుగుల రాముడి విగ్రహం ఆవిష్కరణ

అయోధ్యలో ఏడడుగుల రాముడి విగ్రహం ఆవిష్కరణ

అయోధ్యలో 7 అడుగుల శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ . రోజ్ వుడ్ తో ప్రత్యేకంగా తయారుచేసిన ఈ విగ్రహాన్ని శోధ్  సంస్ధాన్  మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు.

కోదండరాముని అవతారంలో ఈ విగ్రహాన్ని తయారుచేశారు. మ్యూజియంలో రాముని గురించి.. చారిత్రక ఘట్టాలతో పాటు 2500కు పైగా చిత్రాలు, కళారూపాలు ఉన్నా.. కోదండరాముని గురించి వర్ణించే ఆనవాళ్లు లేవు. దీంతో.. కర్ణాటక స్టేట్  ఆర్ట్స్  అండ్  క్రాఫ్ట్  ఎంపోరియం నుంచి రూ.35 లక్షలు ఖర్చుచేసి ఈ విగ్రహాన్ని కొనుగోలు చేశారు. శ్రీరాముని.. విగ్రహం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది.