
హైదరాబాద్, వెలుగు: లంగర్ హౌజ్లో డ్రగ్స్అమ్ముతున్న, కొంటున్న ఇద్దరినీ హెచ్న్యూ, లంగర్హౌస్పోలీసులు పట్టుకున్నారు. ముంబైకి చెందిన మోహిత్సంజయ్మెహ్రా బీటెక్ చదివాడు. కుటుంబంతో కలిసి హైదరాబాద్ వచ్చి నార్సింగిలో ఉంటున్నాడు. ఇటీవల అతడు భార్యతో విడాకులు తీసుకున్నాడు. తరచూ పబ్బులకు వెళ్తూ డ్రగ్స్కు అలవాటు పడ్డాడు.
డ్రగ్స్యూజ్చేస్తూ పెడ్లర్గా కూడా మారాడు. ముంబైకి చెందిన సప్లయర్ నుంచి గ్రాముకు 10 వేలకు కొకైన్తెచ్చి, స్థానికంగా గ్రాముకు రూ.25 వేల దాకా అమ్ముతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు లంగర్ హౌజ్లో సంజయ్, అతని నుంచి కొకైక్కొంటున్న పద్మారావ్నగర్కు చెందిన జసన్రాజ్ను పట్టుకున్నారు. వీరి నుంచి 15 గ్రాముల కొకైన్, 2 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
గంజాయి అమ్ముతున్న మామా అల్లుళ్ల అరెస్ట్..
ఒడిశా నుంచి గంజాయి తీసుకొచ్చి విక్రయిస్తున్న మామా అల్లుళ్లను పోలీసులు అరెస్టు చేసి 10 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా రాష్ట్రం ఖోర్డా జిల్లాకు చెందిన మహరాణా ధీనబంధు (40) వ్యవసాయం చేస్తుంటాడు. కటక్ ప్రాంతానికి చెందిన తన అల్లుడు మోహపాత్ర(23) హైదరాబాద్లో బీటెక్ చదువుతున్నాడు. వీరిద్దరు వారి రాష్ట్రం నుంచి గంజాయి తీసుకొచ్చి హైదరాబాద్రాయదుర్గం మల్కంచెరువు ఏరియాలో అమ్మేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని, కేజీ చొప్పున ప్యాకింగ్ చేసిన పది గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.