ఆ మాత్రం చూసుకోనక్కర్లే.. చట్నీలో బొద్దింక

ఆ మాత్రం చూసుకోనక్కర్లే..  చట్నీలో బొద్దింక

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన ఓ ఘటన ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. కొత్త బస్టాండ్ ముందున్న జనప్రియ హోటల్లో సర్వ్ చేసిన చట్నీలో బొద్దింక రావడంతో కస్టమర్లు భయాందోళనకు గురయ్యారు. అనంతరం చట్నీలో బొద్దింక రావటం, హోటల్లో శుభ్రతపై కస్టమర్లు హోటల్ యజమానిపై మండిపడ్డారు. దీంతో ఆ ప్రాంతంలో కాసేపు ఆందోళన చోటుచేసుకుంది.

ఘటనలో ఎవరైనా అస్వస్థతకు గురయ్యారా, అసలు ఆ చట్నీని ఆ వ్యక్తి తిన్నాడా లేదంటే ముందే బొద్దింకను గమనించాడా అన్న విషయంపై మాత్రం ఇంకా ఎలాంటి సమాచారం లేదు. స్ర్టీట్ ఫుడ్ లేదా ఇలాంటి టిఫిన్ స్టాల్స్ నడిపే యజమానులు పరిశుభ్రత పాటించాలని, లేదంటే చిన్న చిన్న పొరపాట్లే కొన్నిసార్లు ప్రాణాలు కూడా తీయొచ్చని పలువురు ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు.