పేక మేడలా కూలిన నాలుగంతస్తుల బిల్డింగ్

పేక మేడలా కూలిన నాలుగంతస్తుల బిల్డింగ్

కడప జిల్లాలో నాల్గంతుస్థుల బిల్డింగ్ ఒక్కసారిగా పేక మేడలా కూలిపోయింది. అండర్ గ్రౌండ్ బిల్డింగ్ కట్టేందుకు పక్కింటి వ్యక్తి  గోతులు తవ్వడంతో ఆ నాల్గంతస్థుల బిల్డింగ్ కూలిపోయింది. దీంతో అక్కడున్న వారు ఒక్కసారి ఖంగుతిన్నారు.

రైల్వే కోడూరు అయ్యప్ప ఆలయం ఎదురుగా శేఖర్ అనే వ్యక్తి రూ.60 లక్షలతో 4 అంతస్థుల బిల్డింగ్ నిర్మించుకున్నాడు. అయితే అదే ఇంటి పక్కన ఉన్న వెంకటరామరాజు అనే వ్యాపారి   అండర్  గ్రౌండ్ బిల్డింగ్ కట్టడానికి  15 అడుగుల లోతు తవ్వడంతో నాల్గంతుస్తుల భవనం ఒక్కసారిగా నేలకు కుంగిపోయింది. దీంతో ఇంట్లో ఉన్నవారు రాత్రికి రాత్రే ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. బిల్డింగ్ ఓనర్ శేఖర్ కు ఈ విషయం తెలియడంతో వ్యాపారి వెంకటరామరాజుతో వాగ్వాదానికి దిగాడు. దీంతో వెంకటరామరాజు కుంగిపోయిన ఇంటిని, స్థలాన్ని కోటి రూపాయలకు కొనేశాడు. తర్వాత 40 సెకండ్లలో  4 అంతస్థుల బిల్డింగ్ ను నేలమట్టం చేశాడు.