బక్రీద్ కు మటన్ సప్లయ్ ​చేస్తామంటూ ఫ్రాడ్

బక్రీద్ కు మటన్ సప్లయ్ ​చేస్తామంటూ ఫ్రాడ్

మెహిదీపట్నం,వెలుగు: బక్రీద్ కు మటన్ సప్లై చేస్తామని నమ్మించి డబ్బులు వసూలు చేసి పరారైన ముగ్గురిని సౌత్ వెస్ట్ జోన్ పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. ఖిదమత్ ఫౌండేషన్  పేరుతో ముగ్గురు వ్యక్తులు ఒక ఫేక్ యాప్ తయారుచేశారు. బక్రీద్ రోజున రూ. 2,800  నాణ్యమైన మేక మాంసం సప్లై చేస్తామని నమ్మించారు. దీంతో సిటీలోని 2,179 మంది నుంచి డబ్బులు వసూలు చేశారు. బక్రీద్ రోజున మటన్ సప్లై చేయకపోవడంతో  బాధితులు పోలీసులకు కంప్లయింట్ చేయగా  కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బహదూర్ పురా నివాసి మహమ్మద్ నసీర్ (30) , సన్ సిటీకి చెందిన జాఫర్ అహ్మద్ (29), మహమ్మద్ అష్పక్(30) ని అరెస్ట్  చేశారు. నిందితుల నుంచి రూ. 23 లక్షల నగదు, ల్యాప్ టాప్ , ఒక పెన్ డ్రైవ్, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని.. అనంతరం వీరిని కోర్టుకు తరలించారు. నిందితులపై వివిధ ప్రాంతాల్లో పాత కేసులు కూడా నమోదై ఉన్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ అశ్వక్, గోల్కొండ ఏసీపీ సయ్యద్ ఫయాజ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.