
- అదనపు క్లాస్ రూమ్స్ నిర్మాణానికి ప్రపోజల్స్ పంపాలి
హైదరాబాద్ సిటీ, వెలుగు: రాజ్ భవన్ మోడల్స్కూల్లో మరింత మంది స్టూడెంట్లకు అడ్మిషన్లు కల్పించేందుకు అదనపు తరగతి గదుల నిర్మాణానికి ప్రపోజల్స్పంపాలని హైదరాబాద్కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. గురువారం రాజ్భవన్, ఆలియాలోని మోడల్స్కూల్స్ను విజిట్చేసిన ఆయన ల్యాబ్, డైనింగ్ హాల్, కొత్తగా నిర్మిస్తున్న తరగతి గదులను పరిశీలించారు.
రాజ్ భవన్ స్కూల్లో పిల్లలు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారని, ఎంత మంది టీచర్లు ఉన్నారని, స్కూల్కు ఏమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉందా అని అడిగి తెలుసుకున్నారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ షఫీమియా, డిప్యూటీ ఈఓ బి వెంకటేశ్వర్లు, డిప్యూటీ ఐఓఎస్ జివి గుప్తా, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్ పర్సన్ ఆర్ సుజాత, కమిటీ సభ్యులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోపాల్, పుష్పలత తదితరులు పాల్గొన్నారు.
వెయిట్ లిఫ్టర్జవాజి సాయివర్ధన్ కు సత్కారం
ఇటీవల బిహార్లో జరిగిన జాతీయ స్థాయి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించి, వెయిట్లిఫ్టింగ్(89 కేజీలు)లో గోల్డ్మెడల్సాధించిన జవాజి సాయి వర్ధన్ ను కలెక్టర్అనుదీప్గురువారం తన చాంబర్లో సత్కరించారు. సాయివర్ధన్ గతంలో హిమాచల్ ప్రదేశ్ లో నిర్వహించిన పోటీల్లో పాల్గొని కాంస్య పతకం సాధించాడని, భవిష్యత్తులో ఒలింపిక్స్ లో పతకం సాధించేలా కష్టపడాలన్నారు. జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి సుధాకర్, సాయివర్ధన్తండ్రి శివకుమార్, కోచ్ రాజేశ్పాల్గొన్నారు.