చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

కామారెడ్డిటౌన్, వెలుగు : విద్యార్థుల అభివృద్ధికి అధికారులు, టీచర్లు శ్రద్ధ చూపాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్​ సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎస్టీ బాలుర ఆశ్రమ స్కూల్​ను కలెక్టర్ తనిఖీ చేశారు. విద్యా బోధన, స్టోర్ రూమ్, వసతులను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.   విద్యార్థులతో కలిసి కొద్ది సేపు వాలీబాల్ ఆడారు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు.   జిల్లా ఎస్టీ వెల్ఫేర్ అధికారి సతీశ్​యాదవ్,  మున్సిపల్ కమిషనర్ రాజేందర్, తహసీల్దార్ జనార్దన్ ఉన్నారు. 

డ్రైనేజీ వ్యవస్థను సరి చేయాలి.. 

జిల్లా కేంద్రంలో మెయిన్ రోడ్డు పక్కన ఎస్టీ బాలుర హాస్టల్ సమీపంలో ఉన్న డ్రైనేజీ వ్యవస్థను సరి చేయాలని కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​ సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యార్థులతో పాటు, స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే మరమ్మతులు చేయించాలని సూచించారు. 

 జాతీయ ఓటరు దినోత్సవ ప్రతిజ్ఞ 

కామారెడ్డి కలెక్టరేట్​లో శుక్రవారం జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని అధికారులతో ప్రతిజ్ఞ చేశారు.  కార్యక్రమంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్​, అడిషనల్ కలెక్టర్లు  విక్టర్, మదన్మోహన్, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.