ట్రైనీ ఐఏఎస్‌‌‌‌లకు సంక్షేమ పథకాలపై అవగాహన : కలెక్టర్ బాదావత్ సంతోష్

ట్రైనీ ఐఏఎస్‌‌‌‌లకు సంక్షేమ పథకాలపై అవగాహన : కలెక్టర్ బాదావత్ సంతోష్
  • విద్య, వైద్యం, ఆదాయ వనరుల నిర్వహణ వివరాలు తెలిపిన కలెక్టర్ 

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు:  ప్రజల జీవన నైపుణ్యాలు పెంచేలా సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని  కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ ఛాంబర్‌‌‌‌‌‌‌‌లో తెలంగాణ దర్శన్ లో భాగంగా 2024 బ్యాచ్ కు చెందిన ట్రైనీ ఐఏఎస్ లు సలోని చబ్రా, హర్ష్ చౌదరి, కరోలియన్ చింగ్ తిన్నవి, కొయ్యడ ప్రణయ్ కుమార్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, కలెక్టర్ బాదావత్ సంతోష్‌‌‌‌ను కలిశారు.  

ట్రైనీ ఐఏఎస్‌‌‌‌లు జిల్లాలో అటవీ ప్రాంతంలో జీవిస్తున్న చెంచు ప్రజల జీవన విధానం విద్య, వైద్యం, ఆదాయ వనరుల నిర్వహణ, జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, స్కూల్, అంగన్వాడీ కేంద్రాలు, రైతు వేదికలు, నీటి ప్రాజెక్టులు, క్షేత్రస్థాయిలో పరిశీలన చేసినట్లు 
పేర్కొన్నారు.