తాడ్వాయి/ వెంకటాపూర్/ గోవిందరావుపేట, వెలుగు : మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెలపై చలవ పందిళ్లు ఏర్పాటు చేయాలని ములుగు కలెక్టర్ దివాకర ఆఫీసర్లను ఆదేశించారు. శుక్రవారం ఆయన మేడారం ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించారు. ఆలయ పనులను త్వరగా పూర్తి చేయాలని చెప్పారు.
అనంతరం ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా ఊరట్టం జీపీ కొత్తూరు హ్యాబిటేషన్లో జరుగుతున్న పారిశుధ్య పనులను, అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. గోవిందరావుపేట మండలం పసర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. రిజిస్టర్ను పరిశీలించి, వైద్య సేవలపై ఆరా తీశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
