సర్కారు దవాఖానాలను..సద్వినియోగం చేసుకోవాలి : ​కలెక్టర్ ​గరిమా అగర్వాల్

సర్కారు దవాఖానాలను..సద్వినియోగం చేసుకోవాలి :  ​కలెక్టర్ ​గరిమా అగర్వాల్
  •     సిద్దిపేట అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్​ 

గజ్వేల్(వర్గల్​)​, వెలుగు : ప్రభుత్వాసుపత్రులలో అందుతున్న వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సిద్దిపేట అడిషనల్ ​కలెక్టర్​గరిమా అగర్వాల్​సూచించారు. మంగళవారం వర్గల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరోగ్య మహిళ కార్యక్రమంలో 134 రకాల రక్తపరీక్షలు నిర్వహించి మహిళల్లో ఏర్పడే 8 రకాల వ్యాధులను ముందుగానే గుర్తించి చికిత్స అందించవచ్చునన్నారు.

రుతుప్రేమలో భాగంగా ప్రతి ఒక్కరూ మెనుస్ట్రువల్​కప్పులనే వాడాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన నిర్మాణాన్ని గజ్వేల్ పీఆర్డీఈఈ ప్రభాకర్​తో కలిసి పరిశీలించి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం మండలంలోని గిర్మాపూర్, సింగాయిపల్లి గ్రామ పంచాయతీలలో రికార్డులను పరిశీలించారు. 

పల్లె ప్రకృతి వనాలు బాగున్నయ్.. 

ములుగు, వెలుగు : గ్రామాలలో పల్లె ప్రకృతి వనాలు చాలా బాగున్నాయని అడిషనల్​ కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. మండల కేంద్రంలోని జప్తిసింగాయిపల్లి, నాగిరెడ్డిపల్లి గ్రామాలలో పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామం, నర్సరీలు, గ్రామపంచాయతీలను ఆమె పరిశీలించి పలు సూచనలు చేశారు.