మలక్ పేటలోని బ్లైండ్ గర్ల్స్ స్కూల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

మలక్ పేటలోని బ్లైండ్ గర్ల్స్ స్కూల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

హైదరాబాద్ సిటీ, వెలుగు: మలక్ పేటలోని అంధ బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కలెక్టర్​ హరిచందన శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.  ఆమె మాట్లాడుతూ.. హాస్టల్​కాంపౌండ్ వాల్​పై  ఐరన్ మెష్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. హాస్టల్​ఎడమవైపు శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ గృహాలను పరిశీలించారు. వైరింగ్ సమస్య ఉందని తెలియడంతో పరిష్కరించాలన్నారు. ఈ సందర్భంగా తమకు డైనింగ్ హాల్, సెక్యూరిటీ కావాలని కలెక్టర్​ను విద్యార్థులు కోరారు. 

వయోవృద్ధుల శాఖ సహాయ సంచాలకులు  రాజేందర్, తహసీల్దార్​జయశ్రీ, హెచ్ఎం అస్రా ఫాతిమా పాల్గొన్నారు. అలాగే గురువారం ఐదుగురు బాలురు పరారైన నేపథ్యంలో సైదాబాద్​లోని జువైనల్​హోంను కలెక్టర్​ విజిట్ చేశారు. పిల్లలతో కలిసి భోజనం చేశారు.