భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : పెరటి కోళ్ల పెంపకంతో అదనపు ఆదాయం వస్తుందని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ తెలిపారు. శనివారం లక్ష్మీదేవిపల్లి మండలం చాతకొండ ఎస్సీ కాలనీలో గ్రామీణ కుటుంబాలకు పెరటి కోళ్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా 50 మంది మహిళా లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 20 చొప్పున కోడి పిల్లలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి లబ్ధిదారుడుకి పది కిలోల కోళ్ల దాణాతోపాటు అవసరమైన ఫీడర్లు అందజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి వెంకటేశ్వర్లు, ఎన్ఎంఆర్ఐ సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ యోగేశ్ దడేకర్, ఐడీవో డాక్టర్ కపిల్శర్మ, పశు వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.
