బార్డర్  చెక్ పోస్ట్ లు పక్కాగా ఉండాలి : కోయ శ్రీహర్ష

బార్డర్  చెక్ పోస్ట్ లు పక్కాగా ఉండాలి : కోయ శ్రీహర్ష

మాగనూర్, వెలుగు : వచ్చే ఎన్నికల కోసం బార్డర్​ చెక్​పోస్ట్​లను పక్కాగా ఏర్పాటు చేయాలని కలెక్టర్  కోయ శ్రీహర్ష సూచించారు. ఎస్పీ ఎన్​ వెంకటేశ్వర్లు, ఎక్సైజ్​ ఆఫీసర్లతో కలిసి బుధవారం కృష్ణ మండలం బార్డర్  చెక్ పోస్ట్ లను పరిశీలించారు. పోలీస్, ఆర్టీవో, ఎక్స్​జ్  అధికారులతో కలిసి చెక్ పోస్ట్ ల ఏర్పాటుకు అవసరమైన సౌలతులు కల్పించాలని సూచించారు. ఇంటిగ్రేటెడ్  చెక్ పోస్ట్ కై స్థలాన్ని పరిశీలించారు. చెక్ పోస్ట్ లో పోలీస్, ఎక్సైజ్, వ్యవసాయ మార్కెట్ యార్డ్, ఆర్టీవో అధికారుల కోసం ఓ కంటైనర్ ను ఏర్పాటు చేయాలన్నారు. 

బార్డర్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎలక్షన్ల  సమయంలో మద్యం, నగదు నియంత్రణ కోసం చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మాగనూర్  పీహెచ్​సీని పరిశీలించారు. డాక్టర్లు, ఏఎన్ఎంలతో రివ్యూ మీటింగ్​ నిర్వహించారు. ఆయన వెంట అడిషనల్  కలెక్టర్  మయాంక్  మిత్తల్, ఆర్టీవో వీరస్వామి, ఎక్సైజ్ ఆఫీసర్లు కవిత రెడ్డి, రాజ్యలక్ష్మి, సిఐ రాంలాల్, ఎస్ఐ విజయ భాస్కర్  పాల్గొన్నారు.