చదువుతోనే సమాజంలో గుర్తింపు:  పి ఉదయ్ కుమార్

చదువుతోనే సమాజంలో గుర్తింపు:  పి ఉదయ్ కుమార్

అచ్చంపేట, వెలుగు: కష్టపడి చదివితే సమాజంలో మంచి గుర్తింపు వస్తుందని కలెక్టర్‌‌‌‌  పి ఉదయ్ కుమార్  పేర్కొన్నారు. పట్టణంలోని బాలికల బాల సదన్ ను బుధవారం ఆయన సందర్శించారు. బాలసదన్ లో కొత్తగా ఏర్పాటు చేసిన సౌలతులను కలెక్టర్  పరిశీలించారు. బాలసదన్ లో చదువుతున్న చిన్నారుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

బాలికలకు ఆధార్, కుల, ఇన్​కం సర్టిఫికెట్లు అందించాలని ఆర్డీవోను ఆదేశించారు. కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. జిల్లా మహిళా శిశు  సంక్షేమ శాఖ అధికారిణి వెంకటలక్ష్మి, ఆర్డీవో గోపిరాం, సీడబ్ల్యూసీ చైర్ పర్సన్ లక్ష్మణరావు, చైల్డ్  ప్రొటెక్షన్  ఆఫీసర్​ శ్రీశైలం, సీడీపీవో దమయంతి, సఖి కో ఆర్డినేటర్  సునీత, ఉమెన్  హబ్  కో ఆర్డినేటర్ శ్వేత పాల్గొన్నారు.