
కరీంనగర్ సిటీ, వెలుగు: ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి 265 మది అర్జీలు స్వీకరించినట్లు ఆమె చెప్పారు. కరీంనగర్ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూం ఇండ్లు పంపిణీ చేయాలని, ఇందిరమ్మ ఇళ్లు శాంక్షన్ చేయాలని బీసీ పొలిటికల్ జేఏసీ జిల్లా ఇన్చార్జి అఖిల్ పాషా ప్రజావాణిలో అర్జీ అందజేశారు.
జగిత్యాల టౌన్, వెలుగు: ప్రజావాణి సమస్యలను వెంటనే పరిష్కరించాలని జగిత్యాల అడిషనల్ కలెక్టర్ లత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి 25 ఫిర్యాదులను స్వీకరించినట్లు చెప్పారు.
రాజన్నసిరిసిల్ల, వెలుగు: ప్రజల సమస్యల పరిష్కారానికే పోలీస్ గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ మహేశ్ బి.గీతే అన్నారు. సోమవారం ఎస్పీ ఆఫీస్లో ప్రజల నుంచి పలు సమస్యలపై 23 ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వెంటనే పరిష్కరించాలని ఎస్హెచ్వోలను ఆదేశించారు. విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో బాధపడుతున్న హోంగార్డు శివకుమార్కు జిల్లా పోలీసుల పక్షాన రూ.55వేలు సాయంగా అందజేసినట్లు ఎస్పీ తెలిపారు.