ప్రజాపాలనను సద్వినియోగం చేసుకోండి : పమేలా సత్పతి

 ప్రజాపాలనను సద్వినియోగం చేసుకోండి : పమేలా సత్పతి

కరీంనగర్ టౌన్, వెలుగు: ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాల కలెక్టర్​పమేలా సత్పతి సూచించారు. అభయహస్తం 6 గ్యారంటీల  దరఖాస్తులు నమోదు చేసి నమోదులో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. శనివారం 37వ డివిజన్ రామ్ నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కొత్తపల్లి మండలం కమాన్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రజాపాలన కార్యక్రమాన్ని పరిశీలించారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సెంటర్ల వద్ద వృద్ధులు, మహిళల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. దరఖాస్తు నమోదులో ప్రజలకు అధికారులు, సిబ్బంది సహకరించాలని సూచించారు. కార్యక్రమంలో   డిప్యూటీ మేయర్​స్వరూపరాణి హరిశంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, సర్పంచ్​ సంపత్​ పాల్గొన్నారు.

అప్లికేషన్లు అమ్మితే చర్యలు
 

జమ్మికుంట: ప్రజాపాలన అప్లికేషన్లు అమ్మితే చర్యలు కఠిన చర్యలు తీసుకుంటామని అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్​దేశాయ్ సిబ్బందిని హెచ్చరించారు. శనివారం జమ్మికుంటలోని బాయ్స్‌‌‌‌‌‌‌‌ స్కూల్‌‌‌‌‌‌‌‌లో నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం వరంగల్ ఆర్డీఎంఏ సయ్యద్ మసూద్ సైతం ప్రజాపాలనను పరిశీలించారు. 
 

ముత్తారం: ముత్తారం మండలం హరిపురం, మైదంబండ  గ్రామాల్లో నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభకు ఆర్డీవో హనుమాన్ నాయక్ హాజరయ్యారు. ఆయన వెంట  మండల స్పెషల్ ఆఫీసర్ ప్రవీణ్ రెడ్డి , మిషన్ భగీరత ఈఈ  శ్రీనివాస్, ఎంపీడీవో శ్రీనివాస్, తహసీల్దార్ రాజేశ్వరి, ఎంపీవో వేణుమాధవ్, సర్పంచ్ సంపత్ రావు తదితరులు ఉన్నారు.