రోడ్డులో పోతున్న ఇండ్ల వివరాలు సేకరించండి

రోడ్డులో పోతున్న ఇండ్ల వివరాలు సేకరించండి
  • సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్

సిద్దిపేట, వెలుగు :  మెదక్–ఎల్కతుర్తి ఫోర్ లేన్​ నిర్మాణంలో కోల్పోతున్న నిర్మాణాలు వివరాలు సేకరించాలని సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. ఈ విషయమై గురువారం కలెక్టరేట్​లో ఆర్ అండ్ బీ,  నేషనల్ హైవే అథారిటీ అధికారులతో సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్–ఎల్కతుర్తి రహదారి విస్తరణలో ఎవరికీ ఇబ్బందుల్లేకుండా చూడాలన్నారు. త్వరగా వివరాలు సేకరించి అందజేయాలని చెప్పారు. సమావేశంలో ఆర్ అండ్ బీ ఈఈ రాము, నేషనల్ హైవే ఈఈ కరీంనగర్ మనోహర్, సిద్దిపేట బాలమకృష్ణ తదితరులు పాల్గొన్నారు.