స్కూల్స్ ​రీ ఓపెన్​ అయ్యేలోపు రిపేర్లు పూర్తి చేయాలి : ​ రాహుల్​ రాజ్​

స్కూల్స్ ​రీ ఓపెన్​ అయ్యేలోపు రిపేర్లు పూర్తి చేయాలి : ​ రాహుల్​ రాజ్​

మెదక్​టౌన్​, వెలుగు: స్కూల్స్​ రీ ఓపెన్​ అయ్యేలోగా అమ్మ ఆదర్శ స్కూల్స్​లో రిపేర్​పనులు పూర్తి కావాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మెదక్​కలెక్టర్ ఆఫీసులో అడిషనల్​ కలెక్టర్​ రమేశ్​, డీఈవో రాధాకిషన్​, ఇరిగేషన్​ డీఈ, ఏఈలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ.. అమ్మ ఆదర్శ స్కూల్స్​లో ఏర్పాటుచేయాల్సిన వసతులపై అధికారులకు సూచనలు చేశారు.

స్టూడెంట్స్​సంఖ్యకు అనుగుణంగా తాగునీటి వసతి కల్పించాలని ఆదేశించారు. తరగతి గదుల్లో ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో ఆయా శాఖల అధికారులు నర్సింలు,  శ్రీనివాసులు, మెప్మా పీడీ ఇందిర పాల్గొన్నారు.