టేక్మాల్ మండలంలో నాగలి పట్టి చేను దున్నిన కలెక్టర్

టేక్మాల్ మండలంలో నాగలి పట్టి చేను దున్నిన కలెక్టర్

మెదక్​ టౌన్, టేక్మాల్​, అల్లాదుర్గం, వెలుగు: టేక్మాల్​ మండలంలోని ఎల్లంపల్లి తండాకు చెందిన విఠల్​పత్తి చేనును ఆదివారం కలెక్టర్​రాహుల్​రాజ్​పరిశీలించి నాగలి పట్టి దున్నారు. అనంతరం అల్లాదుర్గంలోని పీహెచ్ సీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. సమయపాలన పాటించాలని సిబ్బందిని ఆదేశించారు. అల్లాదుర్గం ఎస్సీ హాస్టల్లో స్టూడెంట్స్​కు నోట్​బుక్స్​ పంపిణీ చేశారు. కేజీబీవీ స్కూల్​రిపేర్​పనులను పరిశీలించారు. ఆయన వెంట  వైద్య సిబ్బంది, హాస్టల్​ నిర్వాహకులు, కేజీబీవీ సిబ్బంది ఉన్నారు.