
- కలెక్టర్ రాహుల్ రాజ్
మనోహరాబాద్, వెలుగు: సర్కారు బడుల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్అన్నారు. గురువారం ఆయన స్కూల్స్రీ ఓపెన్సందర్భంగా మనోహరాబాద్మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ స్కూల్లో స్టూడెంట్స్కు బుక్స్అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్మాట్లాడుతూ.. స్టూడెంట్స్బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని, విద్యతోనే సమాజంలో గుర్తింపు లభిస్తుందన్నారు.
అనంతరం స్టూడెంట్స్తో కలిసి భోజనం చేశారు. అంతకుముందు వన మహోత్సవంలో భాగంగా ఫారెస్ట్ ఆఫీసర్లతో కలిసి ఐటీసీ కంపెనీలో మొక్కలు నాటారు. అనంతరం మండలంలోని రంగాయిపల్లిలో నిర్వహిస్తున్న భూభారతి అవగాహన సదస్సును సందర్శించి అప్లికేషన్లు స్వీకరించారు. కలెక్టర్ వెంట ఆర్డీవో జయచంద్రారెడ్డి, తహసీల్దార్చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీడీవో కృష్ణమూర్తి, ఎంపీవో శ్రీనివాస్ రెడ్డి, టీచర్లు, స్టూడెంట్స్, గ్రామస్తులు పాల్గొన్నారు.
శివ్వంపేట జూనియర్ కాలేజీని పరిశీలించిన కలెక్టర్
శివ్వంపేట: శివ్వంపేట ప్రభుత్వ జూనియర్ కాలేజీని గురువారం కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించారు. గదుల కొరతతో స్టూడెంట్స్, స్టాఫ్ ఇబ్బంది ఎదుర్కొంటున్న విషయాన్ని జిల్లా ఇంటర్ఎడ్యుకేషన్ అధికారి మాధవి కలెక్టర్ రాహుల్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో కాలేజీకి వచ్చిన కలెక్టర్ ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
కాలేజీకి సొంత భవనం లేదని, జిల్లా పరిషత్ హైస్కూల్లో రెండు గదులలో కాలేజీ నిర్వహిస్తున్నట్లు స్టాఫ్ తెలిపారు. హై స్కూల్ లోనే మరో రెండు గదులు ఇస్తే స్టూడెంట్స్కు ఇబ్బందిగా ఉండదని ప్రిన్సిపాల్ శైలజ చెప్పారు. స్పందించిన కలెక్టర్ ఎంఈవో బుచ్చా నాయక్ కు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.