ఓటర్​నమోదుకు మరో ఛాన్స్ : కలెక్టర్​ రాజీవ్​గాంధీ హన్మంతు

ఓటర్​నమోదుకు మరో ఛాన్స్ : కలెక్టర్​ రాజీవ్​గాంధీ హన్మంతు

నిజామాబాద్, వెలుగు : కొత్తగా ఓటర్​ నమోదు అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్​ రాజీవ్​గాంధీ హన్మంతు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన తన ఛాంబర్​లో పొలిటికల్​ పార్టీల లీడర్లతో మీటింగ్​ నిర్వహించి మాట్లాడారు. 2014, జనవరి 1 నాటికి 18 ఏండ్లు నిండిన వారు ఓటర్​గా నమోదు చేసుకోవచ్చన్నారు. లిస్టు మార్పుచేర్పులకు అవకాశం ఉందన్నారు.

మరణించిన వారి పేర్లు తొలగించాలని, డబుల్​ఓట్లను గుర్తించాలన్నారు. మూడు కిలోమీటర్లు దాటి పోలింగ్​కేంద్రాలు ఉంటే తెలుపాలన్నారు. జనవరి 22న డ్రాఫ్ట్​లిస్టును విడుదల చేస్తామని, ఫిబ్రవరి 8న  ఫైనల్​లిస్టు ప్రకటిస్తామన్నారు. అడిషనల్ ​కలెక్టర్​ యాదిరెడ్డి తదితరులు ఉన్నారు. 

టెన్త్​స్టూడెంట్స్​ సన్నద్ధతపై  దృష్టి పెట్టాలి 

టెన్త్​ పరీక్షలు దగ్గరపడుతున్న వేళ టీచర్లందరూ స్టూడెంట్స్​ సన్నద్ధతపై దృష్టి సారించాలని కలెక్టర్​ రాజీవ్​గాంధీ హన్మంతు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్​లో నిర్వహించిన మీటింగ్​లో మాట్లాడారు. ఇంగ్లీష్, సైన్స్, మ్యాథ్స్​ సబ్జెక్టుల్లో వెనుకబడిన వారికి స్పెషల్​క్లాసులు తీసుకోవాలన్నారు. డీఈవో దుర్గాప్రసాద్, జీసీడీవో వనిత, ఏసీఈ విజయభాస్కర్, ఎంఈవోలు, నోడల్​ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.