కొత్త పనులు గ్రౌండింగ్​ చేయొద్దు : శరత్

కొత్త పనులు గ్రౌండింగ్​ చేయొద్దు : శరత్

సంగారెడ్డి టౌన్, వెలుగు: అధికారులు ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు నడుచు కోవాలని, ఎలాంటి పొరపాట్లకు తావివ్వరాదని కలెక్టర్ శరత్ సూచించారు. గురువారం కలెక్టరేట్​లో అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ తో కలిసి ఇంజనీరింగ్ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఎన్నికల కమిషన్ నిబంధనలను విధిగా పాటించాలన్నారు. 

ఇంజనీరింగ్ శాఖలు  చేపట్టిన వివిధ పనుల్లో గ్రౌండింగ్ అయి పనులు జరుగుతున్నట్లైతే, ఆ పనులు చేయవచ్చని, కొత్త పనులను గ్రౌండింగ్ చేయకూడదని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల కోడ్ ఉల్లంఘించరాదని స్పష్టం చేశారు. సమావేశంలో డీఆర్‌‌ఓ నగేశ్​,  ఆర్డీవో రవీందర్ రెడ్డి,  ఇంజనీరింగ్ శాఖల ఎస్‌ఈలు, ఈ ఈ లు, డీఈలు, ఏఈలు, పాల్గొన్నారు.

 

నగదు ట్రాన్జాక్షన్​పై నిఘా పెట్టాలి


అనుమానాస్పద బ్యాంకు లావాదేవీలపై దృష్టి సారించాలని కలెక్టర్ శరత్ బ్యాంకర్లకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి రోజు రూ.లక్ష డిపాజిట్ చేసినా, విత్ డ్రా చేసినా, అదే విధంగా రూ.10 లక్షలు పైబడి నగదు ట్రాన్స్​ఫర్​ అయినా వివరాలు నమోదుచేయాలన్నారు.  ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసినట్లయితే వెంటనే చెక్ బుక్ జారీ చేయాలని సూచించారు. సమావేశంలో అడిషనల్​ కలెక్టర్ మాధురి, ఎల్‌డీఎం గోపాల్ రెడ్డి, డీసీఓ, డీఆర్‌‌ఓ, నగేశ్​, వివిధ బ్యాంకుల కంట్రోలర్స్ పాల్గొన్నారు