నులిపురుగుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ వరుణ్ రెడ్డి

నులిపురుగుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ వరుణ్ రెడ్డి

నిర్మల్/ఆదిలాబాద్​ టౌన్, వెలుగు: నులిపురుగుల పట్ల పిల్లలు అప్రమత్తంగా ఉండాలని, తప్పనిసరిగా ఆల్బెండజోల్ టాబ్లెట్స్ వాడాలని నిర్మల్​ జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి సూచించారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా స్థానిక సోఫీ నగర్ లోని రెసిడెన్షియల్ విద్యాసంస్థలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నులిపురుగుల కారణంగా పిల్లల్లో పోషకాహార లోపం ఏర్పడుతుందని.. దీని ద్వారా రక్తహీనత, ఆకలి లేకపోవడం, అలసట, కడుపునొప్పి, బరువు తగ్గడం వంటి సమస్యలు ఏర్పడతాయన్నారు. ఏడాది నుంచి 19 ఏండ్ల వయసున్న ప్రతి ఒక్కరూ ఈ మాత్రలను వేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంఅండ్ హెచ్​ఓ డాక్టర్ రాజేందర్, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ నయనారెడ్డి, ఎన్సీడీ నిర్వహణ అధికారి డాక్టర్ శ్రీనివాస్, డీపీఆర్ఓ తిరుమల, ప్రిన్సిపాల్ గంగా శంకర్ తదితరులు పాల్గొన్నా రు.

పిల్లలందరికీ ఆల్బెండ జోల్​ మాత్రలు వేయించాలి

పిల్లల సంపూర్ణ ఆరోగ్యానికి ఆల్బెండజోల్ మాత్రలు తప్పనిసరిగా వేయించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. గురువారం స్థానిక కొలాం ఆశ్రమ స్కూల్​లో నిర్వహించిన జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆగస్టు 3 నుంచి 10వ తేదీ వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. పిల్లల్లో  పోషకాహారలోపం, రక్తహీనత, శారీరక, మానసిక సమస్యలను అరికట్టేందుకు మాత్రలను పంపిణీ చేయాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. ప్రభుత్వ, ప్రయివేట్ స్కూళ్లు, కాలేజీల్లో మాత్రలు పంపిణీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్​ఓ డా.నరేందర్ రాథోడ్, ఐసీడీఎస్​పీడీ మిల్కా, అడిషనల్​డీఎంహెచ్ఓ డా.సాధన, ఏటీడీఓ నిహారిక, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.