ప్రజావాణి పెండింగ్ ఫైళ్లను పరిష్కరించాలి : కలెక్టర్లు 

 ప్రజావాణి  పెండింగ్ ఫైళ్లను పరిష్కరించాలి : కలెక్టర్లు 

మహబూబాబాద్/ కాశీబుగ్గ/ నర్సంపేట/ జనగామ అర్బన్, వెలుగు: ప్రజావాణి పెండింగ్​ ఫైళ్లను వెంటనే పరిష్కరించాలని ఆయా జిల్లాల కలెక్టర్లు వివిధ శాఖల ఆఫీసర్లను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్​లో వారు ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. మహబూబాబాద్​ కలెక్టరేట్​లో వివిధ సమస్యలపై 156 వినతులు వచ్చాయని కలెక్టర్​ స్నేహ శబరీశ్​ తెలిపారు. వరంగల్​ కలెక్టరేట్​లో 136 ఫిర్యాదులు వచ్చాయని కలెక్టర్​ సత్యశారద చెప్పారు.

నర్సంపేట టౌన్​లోని ప్రభుత్వ, గ్నీన్ ల్యాండ్​ స్థలాల్లో వెలసిన అక్రమ కట్టడాలను వెంటనే తొలగించాలని సీపీఎం టౌన్ సెక్రటరీ, 10వ వార్డు కౌన్సిలర్​ హనుమకొండ శ్రీధర్​ వరంగల్ కలెక్టర్​కు సీపీఎం నాయకులతో కలిసి వినతి పత్రం అందజేశారు. జనగామ కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి 224 అర్జీలు స్వీకరించినట్లు కలెక్టర్​ సందీప్​ కుమార్​ ఝా పేర్కొన్నారు. ఆయా వినతులను సంబంధిత ఆఫీసర్లకు అందజేసి వెంటనే పరిష్కరించాలని సూచించారు.