
EVM మిషన్, బ్యాలెట్ పేపర్ గుర్తుంది కదా. అదే ఈవీఎం మిషిన్ పై ఉండే పేపర్. ఓటు వేసే ముందు సీరియల్ నెంబర్, అభ్యర్థి పేరు, పార్టీ గుర్తు, బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న చిన్న ఫోటో చూసి ఇప్పటి వరకు ఓటేసేవాళ్లం. దీని వలన ఓటర్లు కన్ఫ్యూజ్ అవుతూ కొన్ని సార్లు ఒకరికి వేయాల్సిన ఓటు మరొక అభ్యర్థికి వేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇకనుంచి ఆ కన్ఫ్యూజన్ కు తావు లేకుండా మరింత క్లారిటీగా ఈవీఎం మిషన్లను తయారు చేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
ఓటర్ ఫ్రెండ్లీగా ఉండేలా ఈవీఎంల లేయౌట్లను తయారు చేస్తున్నట్లు ఈసీ బుధవారం (సెప్టెంబర్ 17) ప్రకటించింది. బ్యాలెట్ పేపర్ మరింత పెద్దదిగా ప్రింట్ చేయడంతో పాటు అభ్యర్థుల కలర్ ఫోటోను కూడా ముద్రించనున్నట్లు పేర్కొంది. ఈ మార్పులను బీహార్ ఎన్నికల నుంచి ప్రారంభిస్తున్నట్లు చెప్పింది.
ఎన్నికల నియమావళి, 1961 లోని రూల్ 49B నింబంధనలను మారుస్తూ.. అభ్యర్థుల ఫోటోలను పెద్దసైజులో.. కలర్ లో ప్రింట్ చేయనున్నట్లు ప్రకటించింది. ఇంతకు మందు లేయౌట్ బ్లాక్ అండ్ వైట్ లో ఉండేది. ఫోటోలు చిన్నవిగా అస్పష్టంగా ఉండేవి. ఇప్పుడు ఓటర్లకు ఎలంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉండేందుకు ఈ సదుపాయం కల్పిస్తున్నట్లు పేర్కొంది. అదే విధంగా సీరియల్ నెంబర్ కూడా చాలా స్పష్టంగా ఇవ్వనున్నట్లు పేర్కొంది.
గతంలో ఉన్న నిబంధనల ప్రకారం.. ఈవీఎం బ్యాలెట్ పేపర్లపై కేవలం క్యాండిడేట్స్ డీటైల్స్ ఉంటే సరిపోయేవి. అంటే అభ్యర్థి పేరు, పార్టీ గుర్తు , సీరియల్ నెంబర్, చిన్న ఫోటో (బ్లాక్ అండ్ వైట్ లో) ఉండేది. మార్చిన నిబంధనల ప్రకారం.. బ్యాలట్ కు సంబంధించి డిజైన్, లేయౌట్ పూర్తిగా ఓటర్ ఫ్రెండ్లీగా తయారు చేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. పోలింగ్ బూత్ లలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
ఇప్పటికే గత ఆరు నెలల్లో ఎన్నికలకు సంబంధించి 28 మార్పులు తీసుకొచ్చినట్లు చెప్పిన ఈసీ.. ఎన్నికల సరళిని సులభతరం చేసేందుకు నిబంధనలు మార్చుతున్నట్లు పేర్కొంది. అభ్యర్థుల పేర్లతో పాటు నోటా కూడా ఒకే ఫాంట్ లో.. లార్జ్ సైజ్ లో ప్రింట్ అవుతుందని తెలిపింది.