రైతులను మభ్యపెట్టేందుకే బీఆర్ఎస్ ధర్నాలు
మంచిర్యాల/లక్ష్మణచాంద, వెలుగు: రుణమాఫీతో పాటు ఇతర సమస్యలపై రైతులు ఉద్యమించకుండా మభ్యపెట్టడానికే బీఆర్ఎస్ లీడర్లు కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్రావు విమర్శించారు. పార్టీ జిల్లా ఆఫీసులో శనివారం ప్రెస్మీట్లో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ నిధులను దారిమళ్లిస్తే.. ఆ నిధులను తిరిగివ్వాలని కేంద్రం కోరడం రైతు రైతు వ్యతిరేకమెట్లవుతుందన్నారు. ఉపాధి నిధులతో ఎన్ని కల్లాలు నిర్మించారో వైట్పేపర్పై రిలీజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లీడర్లు రజినీష్ జైన్, పెద్దపెల్లి పురుషోత్తం, తుల ఆంజనేయులు, వంగపల్లి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
మంత్రులు ధర్నా చేయడం సిగ్గు చేటు..
రైతుల దృష్టి మరల్చేందుకు బీఆర్ఎస్మంత్రులు, ఎమ్మెల్యేలు ధర్నాలు చేయడం సిగ్గుచేటని బీజేపీ రాష్ట్ర నాయకుడు, పెద్దపెల్లి జిల్లా ఇన్చార్జి రావుల రామనాథ్ విమర్శించారు. లక్ష్మణ చాందలో మండల కేంద్రంలో నిర్వహించిన బీజేపీ కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుల గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్కు లేదన్నారు. రామగుండం ఫ్యాక్టరీని పునరుద్ధరించి ప్రారంభించేందుకు ప్రధాని మోడీ రామగుండం వస్తే, సీఎం కేసీఆర్పారిపోయి ఇప్పుడు రైతుల గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. బీజేపీ కార్యకర్తలు గ్రామాల వారీగా రైతుల్ని చైతన్యం చేయాలని రామనాథ్ పిలుపునిచ్చారు. బీజేపీ మండల అధ్యక్షుడు అనిల్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేకు కమీషన్లపైనే శ్రద్ధ: బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్
ఆదిలాబాద్టౌన్, వెలుగు: ఎమ్మెల్యే జోగు రామన్నకు కమీషన్ల మీద ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యల పరిష్కారంపై లేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్శంకర్ విమర్శించారు. శనివారం జిల్లా కేంద్రంలోని గణేశ్థియేటర్ స్థలాన్ని పార్కింగ్ గా మార్చాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర్మాట్లాడుతూ థియేటర్ కూల్చిన స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అంబేద్కర్చౌక్, గాంధీ చౌక్, శివాజీ చౌక్ నేతాజీ చౌక్ వంటి ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్సమస్యను పరిష్కరించకుండా మున్సిపల్ఆఫీసర్లు కమీషన్లకు ఆశపడుతున్నారన్నారు. నెల రోజుల్లో థియేటర్స్థలాన్ని పార్కింగ్ స్థలంగా మార్చాలని లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్ని హెచ్చరించారు. బీజేపీ లీడర్లు వేణు గోపాల్, ఆదినాథ్, మున్నా, రవి తదితరులు
పాల్గొన్నారు.
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు వీఆర్ఎస్ తప్పదు
ఆసిఫాబాద్, వెలుగు : వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు వీఆర్ఎస్తప్పదని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కేసరి ఆంజనేయులు గౌడ్ అన్నారు. శనివారం గోలేటిలో మీడియాతో మాట్లాడుతూ బెల్లంపల్లి ఏరియా గోలేటిలో సింగరేణి ఆవిర్భావ వేడుకల్లో బీఆర్ఎస్ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య, ఆత్రం సక్కు, జడ్పీ చైర్ పర్సన్ కోవలక్ష్మి టీబీజీకేఎస్ లీడర్లు రాజకీయ సభగా చేసుకుని బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గు చేటన్నారు. సింగరేణిని ప్రైవేటీకరించమని ప్రధాని మోడీ స్పష్టంగా చెప్పినా విమర్శిస్తున్నారన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్కు బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదగడం, కూతురు కవిత లిక్కర్స్కాంలో ఇరుక్కోవడంతో ఆందోళన చెందుతున్న కేసీఆర్ దుష్ప్రచారానికి తెరలేపారన్నారు. బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి చేపూరి నవీన్ గౌడ్, గోలేటి పట్టణ ప్రధాన కార్యదర్శి ఎర్ర రాజేశ్తదితరులు పాల్గొన్నారు.
పర్మిషన్ లేకుండా వెంచర్లు చేయొద్దు
బెల్లంపల్లి, వెలుగు: పర్మషన్లు లేకుండా వెంచర్లు చేస్తే కఠిన చర్యలు తప్పవని అడిషనల్ కలెక్టర్ బి. రాహుల్, జేసీ మధుసూదన్ నాయక్ హెచ్చరించారు. బెల్లంపల్లి మండలంలోని కన్నాల పంచాయతీలో ఏర్పాటు చేసిన తిరుమల హిల్స్ వెంచర్ కు డీటీసీపీ పర్మిషన్లేదని ఇటీవల ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై స్పందించిన కలెక్టర్భారతీ హోళికేరి పరిశీలించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. దీంతో అడిషనల్ కలెక్టర్, జేసీ వెంచర్పర్మిషన్పై మండల అధికారులతో ఆరా తీశారు. పర్మిషన్తీసుకోలేదని చెప్పడంతో వెంచర్లో బీటీ రోడ్లను తొలగించాలని రెవెన్యూ, పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు. వారు ట్రాక్టర్తో రోడ్లను తొలగించారు. వెంచర్కు పర్మిషన్వచ్చేవరకు ఇళ్లు నిర్మించకుండా చూడాలాని అడిషనల్కలెక్టర్మండల అధికారులను ఆదేశించారు. బెల్లంపల్లి పట్టణంలోని పాలిటెక్నిక్ కాలేజీ వెనుకాల గల ప్రభుత్వ భూమి 170 పీపీలో అక్రమార్కులు వేసిన ఫెన్సింగ్పోల్స్ను కూడా రెవెన్యూ సిబ్బంది శనివారం ధ్వంసం చేశారు. తాండూర్ మండలంలోనూ డీటీసీపీ పర్మిషన్ లేకుండా ఏర్పాటు చేసిన లేఔట్లను తొలగించారు.
