రాజ్ భవన్లో గోవా అవతరణ దినోత్సవ వేడుకలు

రాజ్ భవన్లో గోవా అవతరణ దినోత్సవ వేడుకలు

 అన్ని రాష్ట్రాల అవతరణ  దినోత్సవాలు రాజ్ భవన్ లో జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు  గవర్నర్ తమిళి సై.  రాజ్ భవన్ లో గోవా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో తమిళి సై పాల్గొన్నారు.  ఈ సందర్భంగా  గోవా రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.  

వేరే రాష్ట్రాల దినోత్సవాలను జరుపుకునే సంప్రదాయానికి శ్రీకారం చుట్టిన మోడీకి ధన్యవాదాలు తెలిపారు. దీని వల్ల   దేశం అంతా ఒకటే అన్న భావన అందరిలో కలుగుతుందన్నారు. దీని వల్ల రాష్ట్రాల మధ్య  హద్దులు తొలగిపోతాయన్నారు.