
- అందుకు ప్లాన్రెడీ చేయాలని
- జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రోస్ఆదేశం
హైదరాబాద్, వెలుగు: సిటీలోని గార్బేజ్ వల్నరబుల్ పాయింట్ల(జీవీపీ)ను పూర్తిగా తొలగించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ అధికారులను ఆదేశించారు. అందుకు తగిన ప్లాన్రెడీ చేయాలని తెలిపారు. మంగళవారం బల్దియా హెడ్డాఫీసులో జోనల్ కమిషనర్లు, హెల్త్ అండ్ శానిటేషన్ విభాగం అధికారులతో పారిశుద్ధ్య నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ రోనాల్డ్రోస్ మాట్లాడుతూ.. కాలనీల నుంచి చెత్తను తరలించేందుకు జోనల్ స్థాయిలో అదనపు వెహికల్స్అందించి, ప్రతి వెహికల్ను ట్రాక్చేయాలని ఆదేశించారు.
మురికి వాడల్లో ఎస్ఎల్ఎఫ్లతో అవగాహన కల్పించాలని, బల్క్ వేస్ట్ జనరేటర్లను పునరుద్ధరించాలని సూచించారు. నిర్మాణ వ్యర్థాల(సీఅండ్ డీ)పై స్పెషల్ ఫోకస్ పెట్టాలని చెప్పారు. ఎస్ డబ్ల్యూజీ కార్మికుల హాజరును పర్యవేక్షించాలని, శానిటేషన్ వర్కర్ల హాజరుకు సంబంధించి మొబైల్ ఆధారిత ఫేషియల్ రికగ్నేషన్ బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్అమలుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పిన్ పాయింట్ ప్రోగ్రామ్ చేపట్టాలని, స్వీపింగ్ యంత్రాలపై పర్యవేక్షణ ఉండాలని చెప్పారు. నిర్ణీత చెత్త సేకరణ పాయింట్లను గుర్తించి, రాంకీ వెహికల్స్తో టైఅప్ చేయాలన్నారు.
రోడ్లపై చెత్త వెయ్యకుండా బోర్డు ఏర్పాటు చేయాలని సూచించారు. షాపుల నిర్వాహకులు, వీధి వ్యాపారులు డస్ట్ బిన్లు మెయింటెన్చేసేలా చూడాలని, నిబంధనలు అతిక్రమిస్తే ఫైన్లు విధించాలని స్పష్టం చేశారు. సీ అండ్ డీ వ్యర్థాలను అక్రమంగా డంప్చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ట్రక్ ఆపరేటర్లతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించాలని, టోల్ ఫ్రీ నెంబర్, మొబైల్ అప్లికేషన్లకు సంబంధించి పౌరులకు, ట్రక్ ఆపరేటర్లకు అవగాహన కల్పించాలని చెప్పారు. ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్లు స్నేహశబరీశ్, చంద్రకాంతరెడ్డి, సునంద, చీఫ్ మెడికల్ అధికారి డాక్టర్ పద్మజ, జోనల్ కమిషనర్లు రవి కిరణ్, హేమంత్ బోర్కడే, అభిలాష్ అభినవ్, వెంకన్న, పీడీ సౌజన్య, స్వచ్ఛ భారత్ పీడీ భారత్ కుమార్, ఏఎంహెచ్ఓలు తదితరులు పాల్గొన్నారు.