మామిడి తోటలో క్షుద్రపూజల కలకలం

మామిడి తోటలో క్షుద్రపూజల కలకలం

పెనుబల్లి, వెలుగు: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం నాయకులగూడెం శివారులోని ఓ మామిడి తోటలో పసుపు, కుంకుమ, సున్నం, బొగ్గు పొడితో10 అడుగుల మనిషి బొమ్మ గీసి పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించడంతో పశువుల కాపరులు భయాందోళనకు గురయ్యారు.

గుమ్మడి కాయ పగలగొట్టి, రెండు కోళ్లను చంపి పడేసి ఉండడంతో ఎవరో క్షుద్రపూజలు చేశారంటూ గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. సరిగ్గా తోట మధ్యలో మనిషి ఆకారంలో గీసిన బొమ్మకు బట్టలు వేసి పూజలు చేయడంతో జనం భయపడిపోతున్నారు.