32 మందికి కారుణ్య నియామక పత్రాలు .. అందజేసిన మేయర్ విజయలక్ష్మి

32 మందికి కారుణ్య నియామక పత్రాలు .. అందజేసిన మేయర్ విజయలక్ష్మి

హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రజలకు ఉత్తమ సేవలను అందించి జీహెచ్ఎంసీకి, ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు.  జీహెచ్ఎంసీలో 32 మందికి కారుణ్య నియామకాల కింద  జీహెచ్ఎంసీ ఉద్యోగాలు కల్పించింది. 

వీరికి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సోమవారం  జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో  నియామక పత్రాలను అందించారు. 32 మందిలో  10 మంది జూనియర్ అసిస్టెంట్​లుగా, 17 మంది ఆఫీస్ సబార్డినెట్​లుగా, 5 మంది పబ్లిక్ హెల్త్ వర్కర్ లుగా  వివిధ విభాగాల్లో పోస్టింగ్ ఇచ్చారు.

 ఈ సందర్భంగా మేయర్  మాట్లాడుతూ.. ఫిర్యాదులు లేకుండా ఉత్తమ పనితీరు కనబరచాన్నారు. విధి నిర్వహణలో సమయ పాలన తప్పనిసరిగా పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ వేణు గోపాల్ తదితరులు ఉన్నారు.