ముంపు బాధితులకు .. పరిహారం చెక్కులు అందజేత 

ముంపు బాధితులకు .. పరిహారం చెక్కులు అందజేత 

గంగాధర, బోయినిపల్లి, వెలుగు: నారాయణపూర్​ రిజర్వాయర్​ ముంపు గ్రామం మంగపేటకు రూ.16.50కోట్ల పరిహారం మంజూరైనట్లు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ తెలిపారు. బుధవారం బూరుగుపల్లిలోని తన నివాసంలో పరిహారం చెక్కులను ముంపు బాధితులకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సమక్షంలో మండలానికి చెందిన సుమారు 100 మంది కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేరారు.

ALSO READ:గృహలక్ష్మి లబ్ధిదారులను ఎంపిక చేయాలి: వల్లూరు క్రాంతి
 

 రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కోదురుపాకలో జరిగిన కార్యక్రమంలో లబ్ధిదారులకు బీసీ బంధు చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో  ఎంపీపీ వేణుగోపాల్, జడ్పీటీసీ ఉమ, బీఆర్ఎస్ లీడర్​రవీందర్ రావు, మండల అధ్యక్షుడు కొండయ్య పాల్గొన్నారు.