17కోట్లతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గేట్ల రిపేర్

 17కోట్లతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గేట్ల రిపేర్
  • ప్రాజెక్టు కట్టినప్పటి నుంచి పూర్తి స్థాయి రిపేర్లు చేయడం ఇదే తొలిసారి

నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గేట్లకు రిపేర్లు చేపట్టారు నీటిపారుదల శాఖ అధికారులు. ప్రాజెక్టు కట్టినప్పటి నుంచి ఇప్పటివరకు పూర్తిస్థాయి మరమ్మత్తులు జరగలేదని.. అందుకే తొలిసారిగా పూర్తి స్థాయిలో మరమ్మత్తులు చేపట్టినట్లు చెబుతున్నారు. 
గత ఏతేడాది ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు రావటంతో మొత్తం గేట్లు ఎత్తేందుకు ప్రయత్నిచగా 10 గేట్లు పనిచేయకపోవడంతో ఇబ్బందులు ఏర్పడ్డాయి. గత ఏడాది చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. దీనికోసం ఉన్నతాధికారులను సంప్రదించగా నిధులు విడుదల చేయడంతో 17 కోట్ల రూపాయలతో గేట్లను రిపేర్ చేస్తున్నారు. ఇప్పటికే ఆరుగేట్ల మరమ్మత్తులు పూర్తయ్యాయి.