పేదల పెన్నిధి కేవల్ కిషన్ : బండ ప్రకాశ్

పేదల పెన్నిధి కేవల్ కిషన్ :   బండ ప్రకాశ్

మెదక్ (చేగుంట), వెలుగు: పేదల, రైతుల భూమి హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన మహనీయుడు కేవల్ కిషన్ అని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ అన్నారు. చేగుంట మండలం పొలంపల్లి శివారులో కామ్రేడ్ కేవల్​కిషన్ 63వ వర్ధంతిని కుటుంబ సభ్యులు, ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బండ ప్రకాశ్ మాట్లాడుతూ.. ప్రజలంతా దేవుడిలా పూజించే మహావ్యక్తి కేవల్ కిషన్ అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో రజాకర్లకు ఎదురొడ్డి పోరాడిన వీరుడని కొనియాడారు. వెట్టిచాకిరి విముక్తి కోసం అలుపెరుగని పోరాటం చేసి  భూస్వాములను గడగడలాడించి పేద ప్రజలకు భూములు పంచి వారి గుండెల్లో నిలిచిన ప్రజానాయకుడు అన్నారు. కార్యక్రమంలో జిల్లా ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు రామకిష్టయ్య, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు విఠల్, వైద్య విధాన పరిషత్ మాజీ కమిషనర్ వీణ, ముదిరాజ్ నాయకులు  పాల్గొన్నారు.