డాక్టర్ నిర్లక్ష్యం వల్లే చనిపోయిందంటూ ఆందోళన

డాక్టర్ నిర్లక్ష్యం వల్లే చనిపోయిందంటూ ఆందోళన

ఖమ్మం: డాక్టర్ నిర్లక్ష్యంతో పేషెంట్ చనిపోయిందంటూ ఖమ్మంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ ముందు ఆందోళన చేశారు మృతిరాలి కుటుంబ సభ్యులు. మరిపెడ మండలం మల్లమ్మ తండకు చెందిన గర్బిణి సునీత (24). కాన్పు కోసం ఓ ప్రైవేటు  హాస్పిటల్ లో చేరింది. నిన్న మధ్యాహ్నం 1గంటకు ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే రాత్రి సునీత చనిపోయిందని డాక్టర్లు చెప్పారు.  అయితే ఆపరేషన్ ఫెయిల్ కావడంతోనే సునీత చనిపోయిందని ఆమె కుటుంబ సభ్యులు హాస్పిటల్ ముందు ధర్నా చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.