వేములవాడలో కాంగ్రెస్ ప్రచార వాహనంపై దాడి

వేములవాడలో కాంగ్రెస్ ప్రచార వాహనంపై దాడి
  •     కారులో వచ్చి ప్లెక్సీలను చింపేసిన దుండగులు  
  •     సంఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ  
  •     పోలీస్​ స్టేషన్​లో కాంగ్రెస్​ లీడర్ల ఫిర్యాదు 

 వేములవాడ, వెలుగు : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్​అభ్యర్థి ఆది శ్రీనివాస్​ ప్రచార వాహనంపై బుధవారం దాడి జరిగింది. నంబర్​ ప్లేట్​ లేని కారులో వచ్చిన దుండగులు వేములవాడ అర్భన్​ మండలం గుర్రవానిపల్లె వద్ద ఆది శ్రీనివాస్ ​ప్రచార రథాన్ని  అడ్డుకున్నారు. వాహనంపై ఉన్న ఆది శ్రీనివాస్​ ఫ్లెక్సీలను చింపివేశారు. డ్రైవర్​అడ్డుకునే ప్రయత్నం చేసే క్రమంలో నెట్టేసి కారులో  పారిపోయారు.

‘మీ కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ ఎట్లా గెలుస్తడో చూస్తం రా’ అని బెదిరించినట్లు  డ్రైవర్ పోలీసులకు తెలిపాడు. విషయం తెలుసుకున్న వేములవాడ డీఎస్పీ నాగేంద్రాచారి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాంగ్రెస్​ పార్టీ కార్యకర్తలు, లీడర్లు పెద్ద సంఖ్యలో వేములవాడ పోలీస్​ స్టేషన్​కు చేరుకొని నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని సీఐ కరుణాకర్​కు  
ఫిర్యాదు చేశారు.