ఇసుక, అసైన్డ్ భూములే కనిపిస్తయ్ : జనంపల్లి అనిరుధ్​రెడ్డి

ఇసుక, అసైన్డ్  భూములే కనిపిస్తయ్ : జనంపల్లి అనిరుధ్​రెడ్డి
  •     జడ్చర్ల కాంగ్రెస్  అభ్యర్థి జనంపల్లి అనిరుధ్​రెడ్డి 

జడ్చర్ల/ మిడ్జిల్, వెలుగు : ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి మిడ్జిల్  మండలంలో ఇసుక, అసైన్డ్​ భూములు తప్ప ఏమి కనిపించవని జడ్చర్ల కాంగ్రెస్​ అభ్యర్థి జనంపల్లి అనిరుధ్​రెడ్డి ఆరోపించారు. మిడ్జిల్  మండలంలోని మున్ననూరు, వాడ్యాల, వేముల, మసిగుండ్లపల్లి, ఈదులబాయితండా, చౌటకుంటతండా, రాయినోనికుంటతండా, మంగళిగడ్డతండా, సింగందొడ్డి, దోనూర్, వస్పూల, వల్లభురావుపల్లి, లింబ్యతండాలలో మంగళవారం ప్రచారం నిర్వహించారు. వివిధ పార్టీల లీడర్లు కాంగ్రెస్​లో చేరారు. అనిరుధ్​రెడ్డికి బోనాలతో స్వాగతం పలికారు.

అనిరుధ్​రెడ్డి​మాట్లాడుతూ మండలంలో ఎంజీకేఎల్ఐ ప్రాజెక్టు పిల్ల కాల్వలు ఇప్పటి వరకు అసంపూర్తిగా ఉన్నాయన్నారు. పింఛన్లు, రేషన్ కార్డులు మంజూరు చేయడం లేదన్నారు. ఒక్క కుటుంబానికి కూడా డబుల్  బెడ్రూమ్​ ఇల్లు మంజూరు చేయలేదని విమర్శించారు. ఇన్ని సమస్యలుంటే సీఎం సభలో రెండు పోలీస్​స్టేషన్లు అడగడమేమిటని ప్రశ్నించారు. పేదలకు కావాల్సింది పోలీస్​ స్టేషన్లు కాదని, వారి సంక్షేమానికి కావాల్సిన పథకాలన్నారు. సిలిండర్ పట్టుకొని ధర్నా చేసినోల్లు సిలిండర్  ధర ఎలా తగ్గిస్తారని ప్రశ్నించారు.

ALSO READ : ఓటు ఎలా వేయాలో అవగాహన కల్పిస్తాం : ప్రశాంత్ జీవన్ పాటిల్

కాం గ్రెస్  వస్తే కరెంట్​ ఇవ్వదని ఈ బ్రాందీ ప్రభుత్వం విష ప్రచారం చేస్తోందని విమర్శించారు. నియోజకవర్గ అభివృద్ది కోసం తనకు ఒక్క చాన్స్​ ఇవ్వాలని అభ్యర్థించారు. జిల్లా వక్ఫ్​బోర్డు మాజీ చైర్మన్​ మహ్మద్​ గౌస్​, మండల అధ్యక్షుడు అల్వాల్ రెడ్డి, ఎంపీటీసీ గౌస్, మల్లికార్జున్ రెడ్డి, వెంకటేశ్, రాజేశ్, సాయిలు, లక్ష్మణ్, లక్ష్మారెడ్డి, పర్వతాలు, ఉస్మాన్, కృష్ణ, జహీర్  పాల్గొన్నారు.